PPM: కొమరాడ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం పశువులతో వస్తున్న వ్యాన్ టూ వీలర్ను ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స అనంతరం 108 ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తరచూ జరిగే ప్రమాదాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.