ప్రకాశం: కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావుని కనిగిరి అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు శుక్రవారం శీలవారిపల్లి గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్లో నూతనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని తమ వంతు సహాయ సహకారాలు కావాలని కోరారు. దీంతో ఆయన అంబేద్కర్ విగ్రహానికి రూ. 1,01,116 రూపాయలు అందజేస్తానని వెల్లడించారు.