అన్నమయ్య: తనపై వస్తున్న ఆరోపణలకు జనసేన పార్టీ ఏపీఐఐసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్ ఆదివారం స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజల మద్దతు పెరుగుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిజాయితీగా పనిచేస్తానని, తప్పుడు ఆరోపణలకు భయపడనని స్పష్టం చేశారు.