PPM: ఏపీ ఎస్టీ కమిషన్ మెంబర్ మల్లేశ్వరరావు నిన్న కురుపాం మండలం నీలకంఠాపురంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ, బాలుర బాలికల పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన ముస్తాబు గదిని పరిశీలించారు. శతశాతం ఉత్తీర్ణత సాధించాలని టెన్త్ విద్యార్థులకు సూచించారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ తప్పనిసరిగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.