WG: బాల్య వివాహాల నిర్మూలన ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని నరసాపురం బార్ అసోసియేషన్ కార్యదర్శి వి.సూర్య ప్రకాశరావు అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనపై శుక్రవారం పీచుపాలెం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై జయలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థులు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.