BPT: కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. రైతులు పండించిన శనగలను ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.