ATP: జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ సజావుగా సాగింది. మొదటి రోజే 2,58,775 మందికి రూ. 115.34 కోట్ల సొమ్మును అధికారులు అందజేశారు. 93 శాతం పంపిణీ పూర్తి చేసి రాష్ట్రస్థాయిలో జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. కలెక్టర్ ఆనంద్ స్వయంగా ఉప్పరపల్లిలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. శనివారం పింఛన్ అందుకోలేని వారికి ఇవాళ అందజేయనున్నారు.