W.G: ఆచంట (M) అయోధ్య లంకలో వశిష్ట గోదావరిపై వంతెన నిర్మాణానికి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీనికి రూ.110 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. ప.గో జిల్లా ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిధులు కేటాయించారు. వంతెన నిర్మాణం పూర్తయితే లంకగ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయి. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.