NDL: బేతంచెర్లలోని శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి ఆలయంలో మంగళవారం ప్రాతఃకాలంలో స్వామి, అమ్మవార్లకు సుప్రభాతం, అభిషేకం, నైవేద్యం, మంత్ర పుష్పాలు సమర్పించారు. చంద్ర గ్రహణం పురస్కరించి ఉభయ దేవాలయ మూర్తులకు దర్భకూర్చలు ఇవ్వగా, ఉపకమిషనర్ రామాంజనేయుల ఆధ్వర్యంలో అర్చకుల సమక్షంలో ఆలయ ద్వారాలు మూసివేశారు.