తూ.గో: రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని కొంతమూరు మసీదులో బుధవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో మంత్రి దుర్గేశ్ పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉపవాస దీక్షను ముగించుకునే ఈ ఆధ్యాత్మిక సందర్భాన్ని పంచుకోవడం ఎంతో ఆనందంగా, అనిపించిందని, సోదరభావం, సహనశీలత, పరస్పర గౌరవానికి ప్రతీకగా రంజాన్ ప్రతీక అన్నారు.