ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అసెంబ్లీలో పోలీసు శాఖ సమస్యలపై ఇవాళ అసెంబ్లీలో ప్రస్తావించారు. పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న పని భారం, సిబ్బంది కొరత, మౌలిక వసతుల లోపాలు వంటి అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. పోలీసులకు తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.