ATP: గుంతకల్లు కూరగాయల మార్కెట్ సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. మద్యం ఎక్కువగా తాగడం వల్లే మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.