NDL: వెల్దుర్తికి చెందిన చిన్నారి పునర్విక చికిత్స కోసం కేంద్ర ఆరోగ్యశాఖ రూ.50 లక్షల సాయం చేసిందని MP శబరి ఇవాళ తెలిపారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సమస్యను తండ్రి తనదృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా NPRD పథకం నుంచి నిధులు విడుదలయ్యాయని అన్నారు. సహకరించిన కేంద్ర మంత్రి JP నడ్డాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.