CTR: చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ అముద, చూడ ఛైర్పర్సన్ హేమలత తదితరులు పాల్గొన్నారు.