W.G: భారత మాజీ ఉపప్రధాని, స్వాతంత్య్ర సమరయోధులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలను ఆచంట మండలం కొడమంచిలి అరుంధతిపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడారు. సామాజిక న్యాయ దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన ధీరుడు జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఆయన భారత సమాజంలో సమానత్వం కోసం కృషి చేశారని అన్నారు.