ప్రకాశం: చంద్రశేఖరపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 25న బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఎల్ బ్రహ్మయ్య తెలిపారు. మండలంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు కావాలని కోరారు.