CTR: పుంగనూరులో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలు (POLYCET) శనివారం ప్రశాంతంగా ముగిశాయి. బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూల్ కేంద్రాల్లో అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 304 మంది విద్యార్థులకు గాను 277 మంది పరీక్షకు హాజరయ్యారని, 27 మంది గైర్హాజరయ్యారని ఎంఈఓ తెలిపారు. అధికారుల పర్యవేక్షణలో పరీక్షా ప్రక్రియ అంతా సజావుగా సాగింది.