ATP: జిల్లా నలంద డిగ్రీ కళాశాలలో ఈ నెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, నలంద కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 10, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హు లన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.