ATP: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ విమర్శించారు. సింగనమల నియోజకవర్గంలో వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఎకరాకు రూ. 40 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.