సన్రైజర్స్ హైదరాబాద్కు శుభవార్త అందింది. గాయం కారణంగా ప్రారంభ మ్యాచ్లకు దూరమౌతాడని భావించిన ఆ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అందుబాటులోకి వచ్చాడు. నేడు నేరుగా బెంగళూరుకు చేరుకుని.. జట్టుతో కలవనున్నాడు. అయితే ఆర్సీబీతో జరిగే మ్యాచ్లో అతను ఆడతాడా? లేదా? అనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. కాగా ఈనెల 28న IPL-19 సీజన్ ప్రారంభం కానుంది.