నెల్లూరు రూరల్ పరిధిలోని 21వ డివిజన్, మాగుంట లే అవుట్లోని రూ. 15.50 లక్షలతో నిర్మిస్తున్న సీసీ డ్రైన్ పనులను కార్పొరేషన్ అధికారులతో కలిసి టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 21వ డివిజన్ అభివృద్ధికి రూ. 3.26 కోట్ల నిధులు కేటాయించామన్నారు