BPT: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు బాపట్ల పట్టణంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు బుధవారం గౌతం గ్రాండ్ హోటల్లో సమావేశం నిర్వహించారు. పార్టీ సభ్యత్వ సమన్వయకర్త పచ్చమట్ల ధర్మరాజు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు.