KRNL: హాలహర్వి మండలం గూళ్యం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు రైలింగ్ మారెప్ప, వీరేషప్ప బైక్ ప్రమాదంలో గాయపడి బళ్లారి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆస్పత్రికి వెళ్లి వారిని సోమవారం పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.