KDP: సింహాద్రిపురం – వెలిదండ్ల బస్సును కేవలం స్కూల్ టైమింగ్లో మాత్రమే నడిపిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు సోమవారం నుంచి మార్నింగ్ స్కూల్ కావడంతో మధ్యాహ్నం 12:30 గంటలకు బస్సు వెళ్లిపోయింది. 10వ తరగతి విద్యార్థులు పరీక్ష రాసి వచ్చేసరికి బస్సు వెళ్లిపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. సమయం పెంచాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.