సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని జామియా మజీద్లో శనివారం రంజాన్ మాసం సందర్భంగా 3వ ఉపవాస దీక్షను ముస్లిం సోదరులు నిర్వహించారు. నమాజ్ అనంతరం మౌలానా మహమ్మద్ ఇలియాజ్ ప్రసంగిస్తూ రోజుకు ఐదు పూటలా నమాజ్ చేయాలని, అది శారీరక-మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు. మండల ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక దువా నిర్వహించారు.