KDP: మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు కడప రెండో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించారని చిన్న చౌక్ SI రాజరాజేశ్వరి రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరపరిచామని ఎస్ఐ తెలిపారు.