ప్రకాశం: మర్రిపూడిలో వ్యవసాయశాఖ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం వ్యవసాయశాఖ అధికారి వెంకటేష్ చలివేంద్రం ఏర్పాటు చేశారు. కార్యాలయంకు పలువురు అనేక పనులు నిమిత్తం వస్తుంటారని అన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నందున రైతులుకు కూడా చల్లని కుండనీరును అందించాలని చలివేంద్ర ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.