ప్రకాశం: పొదిలి ప్రభుత్వ వైద్యశాలను రాష్ట్ర ఎన్సీడీ జాయింట్ డైరెక్టర్ శ్యామల తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, పరిశుభ్రత తదితర అంశాలను పలు విభాగాల్లో పరిశీలించారు. సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల లోపం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అయితే ఆసుపత్రి పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. గుర్తించిన సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు.