NLR: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జనసేన నాయకులతో గురువారం విస్తృత సన్నాహక సమావేశం జరిగింది. “పేదల సేవలో” కార్యక్రమం ఏర్పాట్లపై 8 మండలాల జనసేన నాయకులతో సమగ్ర చర్చలు జరిపి, ప్రతి అంశాన్ని సమీక్షించారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా కార్యక్రమం నిర్వహించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.