W.G: సమాజంలో శాంతి, భద్రత, శ్రేయస్సు వర్ధిల్లాలంటే సామాజిక న్యాయం ఎంతో అవసరమని లీగల్ సర్వీసెస్ సభ్యులు వై.డి. ఫణికర్, ప్యానెల్ లాయర్ కె. శిరీష పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా లింగబోయిన చర్ల గ్రామ సచివాలయం వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత కాలంలో పిల్లలు సోషల్ మీడియా మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.