NLR : తెలుగు భాషాభివృద్ధి, ఉగాది విశిష్టత, రచనలపై మూడు దశాబ్దాలుగా పురాతన శాసనాల గురించి అవగాహన కల్పిస్తున్న బుచ్చికి చెందిన ఉపాధ్యాయులు, గండికోట సుధీర్ కుమార్ ఉగాది పురస్కారం అందుకున్నారు. వెంకటాచలం ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో సంచాలకులు మాడభూషి సంపత్ కుమార్ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆయనకు ప్రశంసా పత్రం అందజేశారు.