E.G: గతంలో వైసీపీకి ఓటు వేసిన వేలాదిమంది 2024లో తన గెలుపుకు కృషి చేశారని అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం పేర్కొన్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వలేదని, ప్రస్తుతం స్వయంగా CM దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.