NDL: డోన్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఇవాళ సీపీఐ నాయకుడు రంగం నాయుడు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటూ సమాజంలో కుల వివక్ష లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ఆయన అన్నారు. ఉపాధి కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించాలని సిపిఐ నాయకుడు పేర్కొన్నారు.