ఎన్టీఆర్: తిరువూరు పట్టణంలో పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ కే. మనోజ శుక్రవారం ఉదయం పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలలో చెత్త సేకరణ, కాలువల శుభ్రత పనులను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు పరిశుభ్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. శుభ్రత పనులు నిరంతరం కొనసాగాలని అధికారులను ఆదేశించారు.