ప్రకాశం: రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామంలో సోమవారం 25 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీడీపీ అభివృద్ధికి కార్యకర్తలందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.