ATP: గుంతకల్లులోని కసాపురం రోడ్డులో గురువారం సొసైటీ బ్యాంకు ఛైర్మన్ తలారి మస్తానప్ప ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ..వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసిన దాతలను వారు అభినందించారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా ముందుకు రావాలన్నారు.