కడప: నగరంలోని చెమ్ముమియాపేట జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్లో ‘శక్తి’ టీమ్ ఎస్సై శాంతమ్మ ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ‘శక్తి’ యాప్ వినియోగం, ఎస్.ఓ.ఎస్ బటన్ ప్రాముఖ్యత, డయల్ 112 సేవలపై విద్యార్థినులకు వివరించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు అందుబాటులో ఉన్న హెల్ప్లైన్ నంబర్లను గుర్తు చేశారు.