కోనసీమ: ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత, మనోధైర్యం లభిస్తాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం మొదలైన ఆత్రేయపురం లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే బండారు పాల్గొన్నారు. స్వామి వారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.