పార్వతీపురం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద హోలీ సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రంగులు జల్లుకున్నారు. అందరూ ఐక్యత, స్నేహభావంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.