SKLM: నరసన్నపేట పట్టణంలోని నెయ్యిల వీధిలో పేకాట శిబిరంపై ఎస్సై గణేష్ ఆదివారం దాడిలు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోనికి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.17 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. పేకాట ఆడిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.