NDL: కారులో ప్రయాణించేవారు సీటుబెల్టు, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆత్మకూరు సీఐ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం తాగి, లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడం చట్టరీత్యా నేరమన్నారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.