GNTR: జిల్లా సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన బడ్జెట్ అవుట్రీచ్ ఈవెంట్-2026-27లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి అవసరాల మేరకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.