W.G: ఉండి మండలం చెరుకువాడలో శనివారం ఇసుక టిప్పర్ లారీ పంటకాలువలో బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో కేవలం డ్రైవర్ మాత్రమే ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడని అతనికి ఎటువంటి గాయాలు కాలేదని స్థానికులు చెబుతున్నారు. ఆకివీడు వైపు నుంచి ఇసుక లోడ్తో ఉండి వైపు వెళుతూ లారీ బోల్తా కొట్టింది.