ప్రకాశం: రేపట్నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సీఐ రామకోటయ్య సందర్శించారు. పరీక్ష నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీస్ సిబ్బందికి, నిర్వహణ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రజలు గమనించి గుంపులుగా ఉండొద్దని చెప్పారు.