NLR: రాపూరు పెంచలకోన క్షేత్రంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే శ్రీ పెనుశీల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణపై MLA కురుగొండ్ల రామకృష్ణ చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.