ATP: శింగనమల మండలం నాయనపల్లి క్రాస్లోని శ్రీ లక్ష్మీ నరసింహ ఆగ్రో ఏజెన్సీస్ను సోమవారం కలెక్టర్ డా. వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ వివరాలను పరిశీలించారు. యూరియా అక్రమ రవాణాపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం స్థానిక రైతులకు యూరియా వినియోగంపై సూచనలు చేశారు.