ప్రకాశం: బేస్తవారిపేట దర్గా కొండపై జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో రంగనాయకులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కార్మికుల హాజరును పరిశీలించారు. ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం బయోమెట్రిక్ (ఫేషియల్) అటెండెన్స్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఆ విధానంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయా అనే విషయాన్ని ఎంపీడీవో అడిగి తెలుసుకున్నారు.