ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీతానగరం ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలో శనివారం విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలోని సరుకుల నిల్వలను, స్టాక్ రికార్డులను పరిశీలించారు. రికార్డుల్లో చూపిస్తున్న సరుకు నిల్వలకు, అక్కడ ప్రత్యక్షంగా ఉన్న నిల్వలకు ఏమాత్రం పొంతన లేదని దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.