ప్రకాశం: టంగుటూరు (M) తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి వీరాంజనేయస్వామి ప్రజల వినతులు స్వీకరించారు. కొండపి నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. అర్జీలను పరిశీలించిన మంత్రి వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.