VZM: తుఫాన్ నేపథ్యంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సోమవారం ఎస్ కోట మండలం మూలబొడ్డవర, దారపర్తి, భర్తాపురం గ్రామాల్లో సోమవారం తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో సతీష్ తదితర అధికారులతో కలసి పర్యటించారు. తుఫాన్ వర్షాలు కారణంగా భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రమాదకరమైన వాగులు దాటవద్దని, అత్యవసరమైతే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.